టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టే’

9 Sep, 2018 02:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే ఎంఐఎం (మజ్లీస్‌) పార్టీ కి వేసినట్టేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓల్డ్‌సిటీ ప్రాంతానికి పరిమితమైన ఒక పార్టీ నేత మాట్లాడుతూ కర్ణాటకలో కుమారస్వామి సీఎం కాగా లేనిది.. తెలంగాణలో తాను సీఎం కాలేనా అన డం అర్థంలేని మాటలన్నారు.

మరిన్ని వార్తలు