గ్రౌండ్‌మన్‌గా అర్జున్‌ టెండూల్కర్‌!

11 Aug, 2018 11:37 IST|Sakshi

లండన్‌: సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ లార్డ్స్‌ మైదానంలో గ్రౌండ్‌మన్‌ అవతారం ఎత్తాడు. గ్రౌండ్‌ స్టాఫ్‌తో కలిసి మైదానంలో సేవలు అందించాడు. భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య లార్డ్స్‌ మైదానంలో గురువారం ప్రారంభం కావాల్సిన రెండోటెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అర్జున్‌ గ్రౌండ్‌ స్టాఫ్‌తో కలిసి మైదానంలో శ్రమించడం పలువురిని ఆకట్టుకుంది. గ్రౌండ్‌ స్టాఫ్‌తో కలిసి అర్జున్‌ టెండూల్కర్‌ సేవలందించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

గత నెలలో భారత అండర్‌-19 జట్టుతో కలిసి ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన అర్జున్‌ అక్కడే ఉండి ఎంసీసీ యంగ్‌ క్రికెటర్లతో కలిసి సాధన చేస్తున్నాడు. ఈ క‍్రమంలోనే టీమిండియా జట్టుకు నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తూ తన బౌలింగ్‌కు మరింత పదును పెట్టుకుంటున్నాడు.

చదవండి: టీమిండియాను ఇబ్బంది పెట్టిన అర్జున్‌

మరిన్ని వార్తలు