భారత్ ఓడిపోవడమే అతనికి ఆనందమట!

1 Apr, 2016 16:06 IST|Sakshi
భారత్ ఓడిపోవడమే అతనికి ఆనందమట!

బౌలర్ల వైఫల్యంతో టీమిండియా సెమీస్‌లో పరాభవాన్ని మూటగట్టుకుంది. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ లెండ్ల్‌ సిమన్స్‌ 51 బంతుల్లో 82 పరుగులు చేసి.. అద్భుతంగా రాణించడంతో కరేబియన్‌ జట్టు ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌ ఇలా ముగిసిందో లేదో బంగ్లాదేశ్ కెప్టెన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ ట్విట్టర్‌లో ఓ తీవ్ర వ్యాఖ్య చేశాడు. 'ఆనందమంటే ఇదే.. హాహాహా! సెమీస్‌లో భారత్‌ ఓడిపోయింది' అంటూ  ట్వీట్ చేశాడు. దీనిపై వెంటనే ట్విట్టర్‌లో దుమారం రేపింది. అప్పటికే భారత్‌ ఓటమితో నిరాశచెందిన అభిమానులకు ఈ ట్వీట్‌ మరింత ఆగ్రహం కలిగించింది. రహీమ్‌ తీరును తప్పుబడుతూ వాళ్లు కామెంట్ చేశారు.

దీంతో రహీమ్ తన ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు. తాను ఆ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. ' అందరికీ సారీ.. వెస్టిండీస్‌కు నేను పెద్ద మద్దతుదారుడిని. అయినప్పటికీ పరుషమైన వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతున్నా' అని పేర్కొన్నారు. అయితే, ముష్ఫికర్ రహీమ్ ట్వీట్‌ను తప్పబడుతూ టీమిండియా అభిమానులు పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని వార్తలు