హైదరాబాద్ 438 ఆలౌట్

7 Nov, 2016 10:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సౌరాష్ట్రతో జరుగుతున్న కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 154.2 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది. 284/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్‌కు షేక్ సొహైల్ (112), జీవీ వినీత్ రెడ్డి (157) సెంచరీలతో భారీ స్కోరును అందించారు. సౌరాష్ట్ర బౌలర్లలో దేవంగ్ 3, కరణ్ 4, ప్రణవ్ కరియా 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర జట్టు 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది.  
 

మరిన్ని వార్తలు