బెల్జియం చేతిలో భారత్ పరాజయం

15 Jun, 2015 02:01 IST|Sakshi

యాంట్‌వర్ప్ (బెల్జియం) : వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టుకు తమ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. బెల్జియంతో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్దార్ సింగ్ సేన 1-2 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ 32వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. 16న తమ చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు యూఎస్‌ఏతో తలపడుతుంది.

మరిన్ని వార్తలు