‘శాఫ్‌’ అండర్‌–19 ఫుట్‌బాల్‌ విజేత భారత్‌

1 Oct, 2023 01:53 IST|Sakshi

ఖట్మండూ (నేపాల్‌): దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–19 ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 3–0 గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ‘శాఫ్‌’ చాంపియన్‌షిప్‌లో భారత్‌ విజేతగా నిలవడం ఇదే ఎనిమిదో సారి కావడం విశేషం. భారత్‌ తరఫున మంగ్లెన్‌తంగ్‌ కిప్‌జెన్‌ రెండు గోల్స్‌ (64వ నిమిషం, 85వ నిమిషం) సాధించగా, గ్వాగమ్‌సర్‌ గోయరీ (90+5వ నిమిషం) మరో గోల్‌ కొట్టాడు.  

మరిన్ని వార్తలు