ధోనికి అదే ఆఖరి మ్యాచా?

4 Feb, 2017 10:02 IST|Sakshi
ధోనికి అదే ఆఖరి మ్యాచా?
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు అపూర్వ విజయాలు అందించి, తన పేరును ఓ బ్రాండ్‌గా మార్చుకున్న భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కెరీర్‌ ఇక ముగిసినట్లేనా?. ఇంగ్లాండ్‌తో ఆఖరి ట్వంటీ-20 తర్వాత ధోనిని సత్కరించి ఓ బహుమతిని అందించింది. అంతేకాకుండా ధోని ఓ మేటి కెప్టెన్‌ అని పేర్కొంటు భారత జట్టుకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు చెప్తూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 
 
ధోని వన్డే కెప్టెన్సీకు విడ్కోలు చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆయన ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతారనే వార్తలు వచ్చాయి. తాజాగా బీసీసీఐ చేసిన వ్యాఖ్యలు ఈ విషయానికి బలం చేకూర్చుతున్నాయి. ఇదే నిజమైతే ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ-20 మ్యాచే ధోనికి ఆఖరుదవుతుంది. టెస్ట్, వన్డే కెప్టెన్సీల నుంచి తప్పుకుంటున్నట్లు ఆకస్మికంగానే ప్రకటించిన ధోని.. రిటైర్మెంటుపై మెరుపు ప్రకటన ఎప్పుడు చేస్తాడో చూడాలి.