సురేఖ జోడీకి రజతం

8 Jul, 2015 00:57 IST|Sakshi
సురేఖ జోడీకి రజతం

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విశ్వ విద్యాలయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రజత పతకం సొంతం చేసుకుంది. కొరియాలోని గ్వాంగ్‌జౌలో జరుగుతున్న ఈ పోటీల మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సురేఖ జోడీకి రెండో స్థానం దక్కింది. ఫైనల్లో భారత జంట సురేఖ-కన్వల్ ప్రీత్ సింగ్ 150-157 స్కోరుతో దక్షిణ కొరియా ద్వయం చేతిలో పరాజయం పాలైంది.

మరిన్ని వార్తలు