టెస్టు క్రికెట్కు ధోనీ గుడ్ బై

30 Dec, 2014 15:42 IST|Sakshi
టెస్టు క్రికెట్కు ధోనీ గుడ్ బై

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. టెస్టు క్రికెట్ నుంచి తక్షణం తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్ కూడా ధోనీ ఆడటం లేదు. జనవరి 6 నుంచి జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్నాడు.

మరిన్ని వార్తలు