సచిన్, గంగూలి, ద్రవిడ్ల సరసన ధోని చేరే అవకాశం
నాటింగ్హామ్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఖాతాలో మరో రికార్డు నమోదు కానుంది. ఇంగ్లండ్తో గురువారం జరగనున్న తొలి వన్డేలో ధోని 33 పరుగుల సాధిస్తే పదివేల పరుగులు పూర్తవుతాయి. దీంతో అంతర్జాతీయ వన్డే చరిత్రలో పదివేల పరుగులు పూర్తిచేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. గతంలో టీమిండియా దిగ్గజాలు సచిన్, గంగూలి, ద్రవిడ్లు ఈ ఫీట్ను సాధించారు. ఓవరాల్గా పదివేల క్లబ్లో చేరిన 12వ ఆటగాడిగా ధోని చేరే అవకాశం ఉంది. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో క్రికెట్ గాడ్, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (18426) ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
రెండో వికెట్ కీపర్గా.. ఇంగ్లండ్తో వన్డే మ్యాచ్లో 33 పరుగులు సాధిస్తే పదివేల పరుగుల సాధించిన రెండో వికెట్ కీపర్గా ధోని అరుదైన ఘనత సాధించనున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 318వన్డేలు ఆడిన ధోని 9967 పరుగలు పూర్తి చేశాడు.. ఇందులో10 శతకాలు, 67 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్ చేసిన కీపర్గా ధోని(107) తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో సంగక్కర (99) రెండో స్థానంలో ఉన్నాడు.
గతంలో పదివేల పరుగులు పూర్తిచేసిన క్రికెటర్లు