ధోనికి తప్పిన ప్రమాదం

17 Mar, 2017 09:38 IST|Sakshi
ధోనికి తప్పిన ప్రమాదం
టీమిండియా క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌ జట్టు కెప్టెన్‌గా విజయ్‌ హజారే ట్రోఫిలో పాల్గొంటున్న ధోని సెమీఫైనల్‌ మ్యాచ్‌ను ఆడేందుకు జట్టుతో కలిసి ఢిల్లీ వెళ్లాడు. నగరంలోని ద్వారకలోని వెల్‌కం హోటల్‌లో జట్టు సభ్యులందరూ బసకు దిగారు. శుక్రవారం ఉదయం 06.30 నిమిషాల ప్రాంతంలో హోటల్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడికి చేరుకున్న 30 ఫైరింజన్లు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
 
ధోనితో పాటు హోటల్‌లో బస చేస్తున్న ఇతర క్రికెటర్లు కూడా సురక్షితంగా ఉన్నారు. కాగా, ట్రోఫీలో సెమీస్‌ మ్యాచ్‌ ఆడటానికి ఢిల్లీ వచ్చిన జార్ఖండ్‌ జట్టు కిట్‌ మొత్తం మంటల్లో బుడిదైంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఉన్నట్లుండి మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.