ఆసియా గేమ్స్ జట్టుపై కొనసాగుతున్న సందిగ్ధత

5 Sep, 2014 17:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్లో పాల్గొనే భారత జట్టుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర క్రీడల మంత్రి సర్వానంద సొనొవాల్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

దక్షిణ కొరియాలో ఈ నెల 19 నుంచి ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ ఈవెంట్కు భారత తరపున ఎంతమంది క్రీడాకారులను పంపాలన్న విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో క్రీడల మంత్రి చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు