రెండో టెస్టుకు మిస్బా దూరం

12 Dec, 2016 13:52 IST|Sakshi
రెండో టెస్టుకు మిస్బా దూరం

హామిల్టన్:న్యూజిలాండ్ తో శుక్రవారం నుంచి ఆరంభం కానున్న రెండో టెసుకు పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ దూరం కానున్నాడు. అతని మావయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మిస్బా తన పర్యటన నుంచి అర్థాంతరంగా వైదొలగనున్నాడు. ఆ మేరకు ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న మిస్బా..హుటాహుటీనా  భార్య, కూతురితో కలిసి పాక్ కు బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. 

 

దాంతో రెండో టెస్టులో అజహర్ అలీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, మిస్బా గైర్హజరీతో సారథ్య బాధ్యతలు ఎవరికీ అప్పగించాలన్న దానిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తొలి టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

>
మరిన్ని వార్తలు