మలేసియా సూపర్ సిరీస్ లో పి.వి.సింధు ఓటమి

16 Jan, 2014 17:29 IST|Sakshi
మలేసియా సూపర్ సిరీస్ లో పి.వి.సింధు ఓటమి

కౌలాలంపూర్: మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి. సింధు కథ ముగిసింది. ఈ రోజు జరిగిన పోరులో ఆరో సీడ్ క్రీడాకారిణి జు బే (కొరియన్) చేతిలో 21-16,21-19 పాయింట్ల తేడాతో సింధు ఓటమి పాలైంది. తొలి రౌండ్ లో ఆకట్టుకున్నసింధు ఈ గేమ్ లో మాత్రం పేలవంగా ఆడింది.ఆద్యంతం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ జు బే తనదైన శైలిలో ఆడి మూడో రౌండ్ కు చేరింది.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో పి.వి.సింధు 21-17, 21-18తో  ఫానెత్రి (ఇండోనేసియా)పై చెమటోడ్చి నెగ్గింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది.
 

మరిన్ని వార్తలు