సెమీస్‌లో రష్మిక

27 Jan, 2017 10:32 IST|Sakshi
సెమీస్‌లో రష్మిక


టెన్నిస్‌ టోర్నమెంట్‌  


సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌–5 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక సెమీస్‌కు చేరుకుంది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో రష్మిక 5–7, 6–4, 6–3తో సారాపై గెలుపొందగా... మరో మ్యాచ్‌లో వినీత 7–5, 6–4తో వైదేహి చౌదరీని ఓడించింది. బాలుర విభాగంలో తీర్థ శశాంక్‌ 6–3, 7–6తో టాప్‌ సీడ్‌ రిషభ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు.


 

మరిన్ని వార్తలు