న్యూఢిల్లీ: మరో భారత క్రికెటర్ పెళ్లి పీటలెక్కనున్నాడు. 27 ఏళ్ల స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు తన స్వస్థలం రాజ్కోట్కే చెందిన రీవా సోలంకీతో శుక్రవారం నిశ్చితార్థం జరగనుంది. జడేజాకు చెందిన రెస్టారెంట్ ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’లోనే ఈ కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్కోట్కు చెందిన కాంట్రాక్టర్, కాంగ్రెస్ నేత అయిన హర్దేవ్సింగ్ సోలంకీ కూతురైన 25 ఏళ్ల రీవా మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. కొన్ని నెలలుగా సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఢిల్లీలో ఉంటోంది. మరోవైపు గతేడాది స్పిన్నర్ హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా వివాహాలతో పాటు, యువరాజ్ నిశ్చితార్థం జరగ్గా... ఈ ఏడాది పేస్ బౌలర్లు మోహిత్ శర్మ నిశ్చితార్థం, వరుణ్ ఆరోన్ వివాహం జరిగాయి.