రూట్ సెంచరీ:నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్

12 Jul, 2014 17:57 IST|Sakshi

నాటింగ్ హమ్:విదేశీ గడ్టలపై భారత్ బౌలింగ్ తేలిపోతుంది అనే వాదనలకు మరోసారి బలం చేకూర్చారు మన బౌలర్లు. నాల్గో రోజు 9 వికెట్ల నష్టానికి 352 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ పరుగుల వరద సృష్టిస్తోంది. 298 పరుగుల వద్ద 9 వికెట్టును కోల్పోయిన ఇంగ్లండ్ ను రూట్ సెంచరీతో ఆదుకున్నాడు. చివరి వరుస ఆటగాడు అండర్ సన్ అతనికి చక్కటి సహకారం అందించడంతో ఇంగ్లండ్ 471 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం రూట్ (136), అండర్ సన్ (75)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత్ బౌలరల్ల ఇషాంత్ శర్మకు మూడు వికెట్లు లభించగా, మహ్మద్ సమీకి రెండు వికెట్లు , భవనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు దక్కాయి.
 

మిడిలార్డర్ తడబడినా... చివరి వరుస బ్యాట్స్‌మెన్ తలా కొన్ని పరుగులు జత చేయడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ పుంజుకుంది. ఓ ఎండ్‌లో రూట్ గోడలా నిలబడటంతో... భారత పేసర్లు రాణించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.  నిర్జీవమైన పిచ్‌పై భారత బౌలర్లు రాణించినా... ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోయ్ రూట్ మాత్రం కొరకరాని కొయ్యగా మారాడు. నాల్గో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. మూడు కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి ఆతిథ్య జట్టు కోలుకునేలా చేశాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 457 పరుగులకే ఆలౌటయ్యింది.

మరిన్ని వార్తలు