సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన కరాటే క్రీడాకారిణి సయ్యదా ఫలక్ ప్రపంచ కరాటే సమాఖ్య (డబ్ల్యూకేఎఫ్) 1 సిరీస్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది. ఈ కరాటే పోటీలు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగనున్నాయి.
ఆమె మహిళల ప్లస్ 68 కేజీల సీనియర్ కుమిటే కేటగిరీలో బరిలోకి దిగనుంది. ఇందులో 86 దేశాలకు చెందిన 1,282 కరా టే క్రీడాకారులు 14 కేటగిరీల్లో తలపడతారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సయ్యదా ఫలక్ బుధవారం అక్కడికి బయలుదేరుతుంది.