సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్, ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో సాయి తేజేశ్, నిఖత్ బాను సత్తా చాటారు. హైదర్గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీ పురుషుల, మహిళల విభాగాల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సాయి తేజేశ్ (జీఎస్ఎం) 8–11, 8–11, 11–7, 12–10, 10–12, 11–9, 11–7తో అరవింద్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందగా, మహిళల ఫైనల్లో నిఖత్ బాను (ఆర్బీఐ) 9–11, 11–4, 11–8, 7–11, 4–11, 11–5, 11–6తో మోనికా (జీఎస్ఎం)ను ఓడించి టైటిల్స్ను కైవసం చేసుకున్నారు. సబ్ జూనియర్ బాలుర విభాగంలో అద్వైత్ (ఏడబ్ల్యూఏ) 11–7, 11–5, 12–10, 12–10తో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్)పై, బాలికల ఫైనల్లో అంజలి (ఎంఎల్ఆర్) 11–6, 11–7, 11–8, 11–8తో మెర్సీ పై గెలిచి చాంపియన్లుగా నిలిచారు.
ఇతర విజేతల వివరాలు
జూనియర్ బాలుర ఫైనల్స్: సరోజ్ సిరిల్ (ఎంఎల్ఆర్) 3–11, 11–9, 11–7, 9–11, 11–8, 11–3తో అమాన్ ఉల్ రెహమాన్ (స్టాగ్ అకాడమీ)పై గెలుపొందారు. బాలికలు: వరుణి జైశ్వాల్ 11–6, 9–11, 12–10, 12–10, 11–3తో ప్రణీతను ఓడించింది. యూత్ బాలుర ఫైనల్స్: హర్ష్ లహోటి (హెచ్వీఎస్) 11–3, 11–8, 11–8, 11–3తో సరోజ్ సిరిల్ (ఎంఎల్ఆర్)పై నెగ్గాడు. బాలికలు: నైనా జైశ్వాల్ 11–9, 11–8, 11–8, 8–11, 11–7తో వరుణి జైశ్వాల్పై నెగ్గింది.
ఇంటర్ స్కూల్ టీమ్ చాంపియన్షిప్
బాలికలు: 1. రోజరీ కాన్వెంట్, 2. గీతాంజలి. బాలురు: 1. సెయింట్ పాల్స్ హైస్కూల్ ‘బి’, 2. ప్రకాశం విద్యానికేతన్. ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ టీమ్ చాంపియన్షిప్: 1. ఎస్బీఐ, 2. పోస్టల్.