షమీ మళ్లీ అవుట్... భారత జట్టులో భువనేశ్వర్

10 Jan, 2016 02:25 IST|Sakshi
షమీ మళ్లీ అవుట్... భారత జట్టులో భువనేశ్వర్

 గాయం కారణంగా పది నెలలు భారత జట్టుకు దూరమై తిరిగి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పేసర్ మొహమ్మద్ షమీ మళ్లీ గాయపడ్డాడు. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా అతనికి కనీసం 4 నుంచి 6 వారాలు విశ్రాంతి అవసరమని, అందుకే స్వదేశానికి వెళుతున్నాడని జట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియా వెళ్లాక తొలి ప్రాక్టీస్ సెషన్‌లోనే అతను గాయపడ్డాడు. షమీ స్థానంలో పేసర్ భువనేశ్వర్ భారత జట్టులోకి వచ్చాడు. ఐదు వన్డేలు, మూడు టి20ల ఈ సిరీస్ ఈనెల 12 నుంచి జరుగుతుంది.

మరిన్ని వార్తలు