మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో సింధు 

14 Jul, 2018 01:50 IST|Sakshi

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ పీవీ సింధు మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–17, 21–13తో సోనియా చెయా (మలేసియా)పై అలవోకగా గెలిచింది. శనివారం జరిగే సెమీఫైనల్లో గ్రెగోరియా మరిస్కా తున్‌జుంగ్‌ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2–0తో ఆధిక్యంలో ఉంది.    

>
మరిన్ని వార్తలు