శివకుమార్ 7/30

14 Jan, 2015 01:01 IST|Sakshi
శివకుమార్ 7/30

త్రిపుర 151 ఆలౌట్

సాక్షి, ఒంగోలు: ఆంధ్ర బౌలర్ దువ్వారపు శివకుమార్ అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. త్రిపురతో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 30 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా త్రిపుర తమ తొలి ఇన్నింగ్స్‌లో 47.5 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. పదో నంబర్ బ్యాట్స్‌మన్ రాణా దత్తా (64 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా, రాకేశ్ సోలంకి (39 బంతుల్లో 37; 7 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించాడు.

అనంతరం ఆంధ్ర బ్యాటింగ్ కూడా తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 4 వికెట్లకు 97 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ కైఫ్ (82 బంతుల్లో 40 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. శ్రీరామ్ (23), ప్రదీప్ (12), ప్రశాంత్ (4), భరత్ (0) వెనుదిరిగారు. ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 54 పరుగులు వెనుకబడి ఉంది.

మరిన్ని వార్తలు