చాంపియన్స్‌ సుహిత, రితిన్‌ ప్రణవ్‌

9 Mar, 2019 10:11 IST|Sakshi

ఆసియా ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా ర్యాంకింగ్‌ అండర్‌–14 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఎం. సుహిత, రితిన్‌ ప్రణవ్‌ సెంథిల్‌ కుమార్‌ సత్తా చాటారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్‌ ఫైనల్లో ఆరోసీడ్‌ సుహిత 6–3, 6–3తో కుందనశ్రీ బండారుపై విజయం సాధించింది. మరోవైపు బాలుర టైటిల్‌పోరులో ఎనిమిదో సీడ్‌ రితిన్‌ ప్రణవ్‌ 4–6, 6–4, 6–4తో ఏడో సీడ్‌ ప్రజ్వల్‌ తివారీని ఓడించాడు. డబుల్స్‌ కేటగిరీలో సౌమ్య–చాందిని శ్రీనివాసన్‌ జంట, బాలుర విభాగంలో అదిత్‌ అమర్‌నాథ్‌–రుషీల్‌ ఖోస్లా జోడీలు చాంపియన్‌లుగా నిలిచాయి.

బాలికల డబుల్స్‌ ఫైనల్లో మూడోసీడ్‌ సౌమ్య–చాందిని ద్వయం 6–3, 6–2తో టాప్‌సీడ్‌ చహన బుద్ధపాటి–సుహిత జంటపై గెలుపొందగా... బాలుర తుదిపోరులో టాప్‌ సీడ్‌ అదిత్‌ అమర్‌నాథ్‌–రుషీల్‌ ఖోస్లా జంట 6–2, 6–2తో వెంకట్‌ రిషి–ప్రణీత్‌సింగ్‌ జోడీపై నెగ్గింది. అంతకుముందు సెమీస్‌ మ్యాచ్‌ల్లో చహన–సుహిత జంట 6–0, 6–1తో ప్రాప్తి పాటిల్‌ (భారత్‌) –సనేషి (శ్రీలంక) జోడీపై విజయం సాధించగా... సౌమ్య–చాందిని జంటకు వాకోవర్‌ లభించింది. బాలుర సెమీస్‌ మ్యాచ్‌ల్లో అదిత్‌–రుషీల్‌ ఖోస్లా ద్వయం 6–3, 6–3తో వినీత్‌ ముత్యాల–దేవహర్షిత్‌ నీలమ్‌ జంటపై, వెంకట్‌ రిషి–ప్రణీత్‌ సింగ్‌ జంట 6–4, 4–6, 12–10తో రికిల్‌–నవల్‌ కిషన్‌ ప్రీతి జోడీపై విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి. 

మరిన్ని వార్తలు