ఓటమితో మొదలు...

5 May, 2016 00:38 IST|Sakshi

మార్లో (ఇంగ్లండ్): బ్రిటన్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 0-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఆట 38వ నిమిషంలో, 57వ నిమిషంలో ఎలీ రాయర్ బ్రిటన్‌కు రెండు గోల్స్‌ను అందించింది. ఆట ఏడో నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా ఫలితం లేకపోయింది. రెండో క్వార్టర్‌లో రీతూ గోల్ చేసే ప్రయత్నాన్ని బ్రిటన్ గోల్‌కీపర్ అడ్డుకుంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ గురువారం జరుగుతుంది.

మరిన్ని వార్తలు