పాకిస్తాన్తో మూడో టెస్టు
షార్జా: తొలి రెండు టెస్టులను కోల్పోరుున వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో మాత్రం ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఓపెనర్ బ్రాత్వైట్ (318 బంతుల్లో 142 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ శతకానికి తోడు చేజ్ (89 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్), డోరిచ్ (90 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో విండీస్ తమ తొలి ఇన్నింగ్సలో 115.4 ఓవర్లలో 337 పరుగులు చేసి ఆలౌట్ అరుు్యంది. దీంతో విండీస్కు 56 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యం లభించింది.
వహాబ్ రియాజ్కు ఐదు వికెట్లు దక్కారుు. అనంతరం రెండో ఇన్నింగ్స ప్రారంభించిన పాక్ను పేసర్ జేసన్ హోల్డర్ (3/10) వణికించడంతో మూడో రోజు ఆట ముగిసేసరికి 39 ఓవర్లలో నాలుగు వికెట్లకు 87 పరుగులు చేసింది. క్రీజులో అజహర్ అలీ (45 బ్యాటింగ్), సర్ఫరాజ్ (19 బ్యాటింగ్) ఉన్నారు. హోల్డర్ విజృంభణతో 11 పరుగుల వ్యవధిలోనే పాక్ నాలుగు వికెట్లను కోల్పోరుుంది.