రాయదుర్గం, న్యూస్లైన్: జాతీయ టాలెంట్ సిరీస్ టెన్నిస్ అండర్-14 సింగిల్స్లో విజేతగా నిలిచిన ప్రలోక్ ఇక్కుర్తిని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ హేమా చెన్నుపాటి అభినందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా క్రీడలకు ప్రత్యేక కోచ్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడానికి యాజమాన్యం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల టెన్నిస్ కోచ్ డేవిడ్ రాజ్కుమార్, ఇతర కోచ్లు పాల్గొన్నారు.