టి20 ప్రపంచకప్‌కు వచ్చేస్తా

16 Dec, 2015 23:48 IST|Sakshi
టి20 ప్రపంచకప్‌కు వచ్చేస్తా

మార్చిలో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచ కప్ సమయానికి భారత జట్టులోకి వచ్చేస్తానని ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. చివరిసారిగా 2012లో భారత్ తరఫున తను టి20 మ్యాచ్ ఆడాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు రంజీట్రోఫీలోనూ నిలకడగా రాణించా. బౌలర్‌గా పూర్తి కోటా ఓవర్లు వేస్తున్నాను. సరైన దిశలో వెళుతున్నందున టి20 ప్రపంచకప్ సమయానికి జట్టులోకి వస్తానని నమ్ముతున్నా’ అని యూసుఫ్ చెప్పాడు.
 

మరిన్ని వార్తలు