-

మూడు జిల్లాల్లో హై అలర్ట్

24 Sep, 2016 15:44 IST|Sakshi
మూడు జిల్లాల్లో హై అలర్ట్
హైదరాబాద్: తెలంగాణలోని మూడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వస్తున్న వరదతో శనివారం సాయంత్రానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తి వేసే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
 
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 3.60 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో దిగువ ప్రాంతాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వారిని అప్రమత్తం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మూడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
మరిన్ని వార్తలు