పైరసీ నిరోధానికి ఉన్నతస్థాయి కమిటీ

29 Jun, 2014 02:10 IST|Sakshi

సాక్షి, బెంగళూరు :  రాష్ట్రంలో సినీ పైరసీని అడ్డుకునేందుకు విశ్రాంత ఐపీఎస్ అధికారి బీ.కే శివరాం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర చలనచిత్ర మండలి అధ్యక్ష గంగరాజు మీడియాకు శనివారం తెలిపారు. పైరసీ నిరోధానికి అనుసరించాల్సిన విధానలపై ఈ కమిటీ ప్రభుత్వంతో పాటు చలనచిత్ర మండలికి సూచనలు ఇస్తుందన్నారు. కాగా, ప్రభుత్వం కూడా పైరసీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గంగరాజు డిమాండ్ చేశారు.  
 

మరిన్ని వార్తలు