లోయలో పడిన జీపు, ఐదుగురు మృతి

1 Jan, 2017 19:37 IST|Sakshi
మడ్లక్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మడ్లక్ లో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న జీపు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
మరిన్ని వార్తలు