మా సభ్యులపై దాడి చేశారు

8 Mar, 2015 04:12 IST|Sakshi

హైదరాబాద్: తమ సభ్యులపై అధికార పార్టీ సభ్యులు దాడిచేశారంటూ టీడీపీ ఎ మ్మెల్యేలు స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి నేతృత్వంలో సభ్యులు స్పీకర్ గది వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న బీజేపీ ఎమ్మె ల్యే కిషన్‌రెడ్డిని తమకు సహకరించాల్సిం దిగా, అంతా కలసి ఉంటేనే అధికారపక్షాన్ని ఎదుర్కొంటామంటూ కోరారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరనందుకే తనపై దాడిచేశారని ఎమ్మెల్యే ప్ర కాష్‌గౌడ్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని స్పీకర్ సూచించడంతో వారు వెనుదిరిగారు. ‘ పార్టీలు ఫిరాయించిన వారిపై అనర్హత వేటువేసే వరకు మా ఆందోళన కొనసాగుతుంది. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై చర్య తీసుకునే దాకా నిరసన కొనసాగిస్తాం. సభ్యులపై దాడి విషయం పై బీఏసీ ముగిశాక కాంగ్రెస్, బీజేపీలతో కలసి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాం..’ అని ఎర్రబెల్లి ఆ తర్వాత లాబీల్లో  విలేకరులతో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు