కాజీపేట రైల్వేట్రాక్పై మృతదేహం

13 Dec, 2015 09:56 IST|Sakshi

వరంగల్ : కాజీపేట రైల్వేట్రాక్పై మహిళా మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు. అందులోభాగంగా మృతురాలు సుబేదార్కు చెందిన స్వర్ణలతగా గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భర్త మహేందర్ వరకట్న వేధింపుల వల్లే చనిపోయిందంటూ స్వర్ణలత బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు