నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బుధవారం ఉదయం భూమి కంపించింది. హాలియా, గుర్రంపోడు, పెద్దపూర మండలాల్లో భూమి కంపించింది. 2 నుంచి 3 సెకన్లపాటు ప్రకంపనలు సంభవించినట్లు ప్రజలు చెబుతున్నారు. ప్రజలు భయకంపితులై ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు.