పారాసిటమాల్‌ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత: కేంద్రం

18 Apr, 2020 03:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పారాసిటమాల్‌ మాత్రల ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కరోనా బాధితుల చికిత్సలో ఈ మాత్రలు కీలకంగా పనిచేస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఈ మందులను విదేశాలకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ కరోనా కేసుల సంఖ్య పెరిగితే పారాసిటమాల్‌ ట్యాబ్లెట్ల కొరత రాకుండా ఉండేం దుకు అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తగినన్ని నిల్వలు ఉన్నందున ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర విదేశీ ఎగుమతుల డైరెక్టర్‌ జనరల్‌ అమిత్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పారాసిటమాల్‌లో వినియోగించే ముడి సరుకు ఎగుమతులపై మాత్రం ఆంక్షలు యథావిధిగా అమలులో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. 

మరిన్ని వార్తలు