వచ్చే ఎన్నికల్లో జగన్‌ గెలుపు ఖాయం

31 Jul, 2018 10:10 IST|Sakshi
జగన్‌ సీఎం కావాలని పూజలు చేస్తున్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు 

వైఎస్సార్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

నాగోలు రంగారెడ్డి : సర్వజనులూ వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని,  అమ్మవారి ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి చండీయాగం నిర్వహించడం అభినందనీయమని వైఎస్సార్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిలు అన్నారు. ఎల్‌బీనగర్‌ నాగోలు స్నేహపురికాలనీలో యాగ నిర్వాహకులు ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న మహారుద్ర సహస్ర చండీయాగం మహోత్సవం ఏడాది పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని అన్నారు. ప్రజాకర్షక రామరాజ్యం అందించి విజయం చేకూరాలని అమ్మవారివారి ఆశీస్సులతో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చండీయాగం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి తెలుగు ప్రజలందరూ బాగుండాలని, అందరి ఆకాంక్ష మేరకు జగన్‌ సీఎం కావాలని ఆకాంక్షించారు.

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆయన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యాగ నిర్వాహకులు నల్లపెద్ది శివరామప్రసాద్‌ శర్మ, శ్రీనివాస శర్మ, నాగేంద్రకుమార్‌ శర్మ, వైఎస్సార్‌ సీపీ నాయకులు బండారు వెంకటరమణ, పిట్టల రవి, రవిందర్‌రెడ్డి, నర్సింగ్, అశోక్‌యాదవ్, ప్రవీణ్‌కుమార్, టిల్లు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు