ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

26 Oct, 2015 15:44 IST|Sakshi

ఇల్లందు (ఖమ్మం) :  ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా ఇల్లందులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన అజ్మీరా విజయ్ కుమార్(19), బానోతు తేజస్విని(18) స్థానిక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

కాగా సోమవారం ఉదయం కళాశాలకని బయలుదేరిన వీరిద్దరూ ఇల్లందులోని బొగ్గు రవాణాకు ఉపయోగించే రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న పొదల్లో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని విజయ్ కుమార్ తన సోదరుడికి తెలుపడంతో.. అతను సంఘటనా స్థలానికి చేరుకొని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

>
మరిన్ని వార్తలు