సిలిండర్లపై మధ్యాహ్న భోజనం: కేటీఆర్

20 Dec, 2015 01:38 IST|Sakshi
సిలిండర్లపై మధ్యాహ్న భోజనం: కేటీఆర్

సిరిసిల్ల: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిలపై కాకుండా గ్యాస్ సిలిండర్లపై తయూరు చేయూలని, ఇందుకోసం అన్ని స్కూళ్లకు సిలిండర్లు అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ, పేదలకు భూపట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లావాసి అరుునందున ముందుగా ఇక్కడినుంచే మార్పునకు శ్రీకారం చుట్టాలన్నారు.

అన్ని మతాలను గౌరవించే సంస్కారం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉందని, పండుగ పూట పేదలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు చేయూతనందిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు