వేగంగా వెళ్తున్న ఇసుక లారీ ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వేంగంగా వెళ్తున్న లారీ రోడ్డు దాటుతున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న మల్లికార్జున(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.