రాజ్యాంగ పరిరక్షణకు దేశ  వ్యాప్తంగా సభలు: జాజుల 

12 Jan, 2019 04:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ పరిరక్షణకు దేశవ్యాప్తంగా సభలు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12న నల్లగొండ, 13న విజయవాడ, 22న ఢిల్లీ, 27న ఒరిస్సాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ 48 గంటల్లో అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. జనా భాలో సగానికి పైగా ఉన్న బీసీలను పట్టించుకోకుండా కేవలం ఓట్ల లబ్ధి కోసం బీజేపీ ప్రభు త్వం కుట్ర చేసిందన్నారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సభలకు జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. 

మరిన్ని వార్తలు