చెట్టుకు ఢీకొన్న బైక్... సింగరేణి కార్మికుడు మృతి

28 Mar, 2015 07:37 IST|Sakshi

పినపాక: బైక్‌పై వేగంగా వెళుతూ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మణుగూరు శివార్లలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు... సింగరేణిలో వాహన డ్రైవర్‌గా పనిచేసే వి.పోశం(45) శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మణుగూరు నుంచి పీవీ కాలనీ వైపు వెళుతుండగా.... మామిడితోట వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పోశం అక్కడికక్కడే మృతి చెందాడు.

మరిన్ని వార్తలు