ఖమ్మంజిల్లాలో ఎదురుకాల్పులు

24 Jan, 2016 20:28 IST|Sakshi

ములుగు: వరంగల్ జిల్లా ములుగు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున కాల్పుల మ్రోతతో దద్దరిల్లింది. సీపీఐ(ఎంఎల్) కు చెందిన క్రాంతికుమార్ దళానికి, స్పెషల్ పార్టీ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.


క్రాంతికుమార్ తన దళసభ్యులతో కలసి దొరవారి వేంపల్లి ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా, కూంబింగ్ చేస్తున్న స్పెషల్‌పార్టీ పోలీసులు అటుగా వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దళ సభ్యులు చెల్లాచెదురైపోగా సారంగం అనే ఓ సభ్యుడు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. ఆ సభ్యుడిని వెంట పెట్టుకుని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనిపై గూడూరు సీఐ వెంకటేశ్వర్లును సంప్రదించగా, సంఘటన జరిగింది నిజమేనని, పూర్తి వివరాలు స్పెషల్ పార్టీ పోలీసులు  వెల్లడిస్తారని చెప్పారు.

మరిన్ని వార్తలు