డ్రంకెన్‌ డ్రైవ్ కేసుల్లో పలువురికి జైలు శిక్ష

14 Dec, 2015 17:57 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిని ఎల్‌బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ పుష్పాదేశ్‌ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 47 మందికి రూ.2వేల జరిమానా, అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి 6 రోజుల జైలు శిక్ష విధించారు.

మరిన్ని వార్తలు