సోమాజిగూడ: భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. గ్రీన్లాండ్స్లోని హరిత ప్లాజా భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కిషన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన నగరానికి రావడంతో పలువురు ప్రముఖులు ఆయనను కలిసేందుకు విచ్చేశారు.