ఒకేసారి తప్పిన పెను ప్రమాదాలు

25 Aug, 2019 10:32 IST|Sakshi

సాక్షి, కోదాడ : ఇద్దరు వాహనదారులు చాకచక్యంగా వ్యవహరించడంతో శనివారం  పెను ప్రమాదాలు తప్పాయి. వివరాలలోకి వెళ్తే ..మండల పరిధిలోని దోరకుంట శివారులో గల అశోక్‌లేలాండ్‌ లోకి వెళ్తేందుకు లారీ జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుంది.  అదే సమయంలో కోదాడ నుంచి ద్విచక్రవాహనంపై నల్లబండగూడెం వెళ్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా లారీ మలుపును గమనించకుండా    దాని వెంటనే వెళ్లడంతో అది పూర్తిగా  లారీ మధ్యటైర్ల కిందకు వెళ్లింది. దీంతో బైక్‌పై ఉన్న అతను ఒక్కసారే దానిని వదిలేసి పక్కకు దూకాడు. ఈ ప్రమాదంలో బైక్‌ పూర్తిగా నుజ్జు అయింది. అదే సమయంలో అటుగా చూసుకుంటు   విజయవాడ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డుకిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూడా ఎవరకు గాయడలేదు. పోలీసులు వచ్చి వాహనాలను బయటకు తీసి పంపించారు. 

మరిన్ని వార్తలు