కృష్ణా, గోదావరి బోర్డుల్లో  అడ్మినిస్ట్రేటివ్‌ సభ్యుడిగా సోమేశ్‌ కుమార్‌ 

26 Nov, 2019 01:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డుల్లో రాష్ట్రం తరఫున అడ్మినిస్ట్రేటివ్‌ సభ్యుడిగా రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ పోస్టులో నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సభ్యుడిగా ఉంటారు. అయితే గతంలో శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సోమేశ్‌ ఉండటంతో ఆయన్నే సభ్యుడిగా నియమించారు. తర్వాత ఆయన్ను రెవెన్యూ శాఖకు బదిలీ చేయడంతో ఆ బాధ్యతలు సీఎస్‌ జోషి చూడాల్సి ఉంది. జోషి వచ్చే నెలలో రిటైర్‌ అవుతుండటంతో సోవేశ్‌నే సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

>
మరిన్ని వార్తలు