టీచర్ను చితకబాదిన గ్రామస్తులు

1 Aug, 2014 12:39 IST|Sakshi

నల్గొండ : విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిని గ్రామస్తులు చితకబాదారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అట్లూరులో జడ్పీ స్కూల్లో ఈ  సంఘటన జరిగింది. గత కొంతకాలంగా ఉపాధ్యాయుడు... విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో విసిగిపోయిన వారు... విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు టీచర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు.
 

మరిన్ని వార్తలు