‘టీడీపీతో పొత్తు వల్లే ఓడిపోయాం..’

5 Feb, 2019 20:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశం అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు చెప్పాలని రాహుల్ గాంధీ ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పొత్తు వల్ల ప్రయోజనం జరిగిందా అని రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అడిగారు.
 
చంద్రబాబుతో పొత్తు వల్లే తెలంగాణలో ఓడిపోయామని రాహుల్ గాంధీతో నేతలు చెప్పారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఉద్యమాలుగా మలచలేకపోయామని నేతలు వివరించారు. చివరి నిమిషం వరకు టికెట్ల ఖరారు జాప్యం చేయడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని వివరణ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విముఖత వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు