టీఆర్‌ఎస్‌ ‘పార్లమెంటరీ’  సమావేశాలు వాయిదా 

28 Feb, 2019 05:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మార్చి 1 నుంచి జరగాల్సిన టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు వాయిదా పడ్డాయి. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో సంప్రదించిన తర్వా త కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు