గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

23 Jun, 2015 14:57 IST|Sakshi

సరూర్ నగర్‌ (రంగారెడ్డి)  : రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌లోని మారుతి నగర్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతి నగర్ చివరి బస్టాప్‌కు దగ్గరలోని ఓ ఖాళీ స్థలంలో సుమారు 35 సంవత్సరాల వయసున్న వ్యక్తి లుంగీతో ఉరేసుకున్నాడు. మంగళవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు