ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

9 Nov, 2014 03:01 IST|Sakshi

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఎక్కం భూమయ్య (46) అనే రైతు అర్థిక ఇబ్బందులతో శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్టు ఏఎస్‌ఐ రజాక్ తెలిపారు. భూమయ్య తనకున్న ఎకరం పొలంలో సేద్యం చేస్తూ, గ్రామంలో  చిన్న చిన్న పనులు చేసేవాడు. సాగు నీరు లేక పొలం ఎండి పోతోందని బాధపడేవాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 

మరిన్ని వార్తలు